మెదక్ : కోల్చారం మండలం హనుమలబండ గ్రామం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. బైక్ను ఆర్టిసి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.