ఢిల్లీ: కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, ఎంఎల్ఎ డికె శివ కుమార్కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న శివ కుమార్ను ఇడి అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు 25 లక్షల బాండ్ను సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా దేశం దాటిపోవద్దని హెచ్చరించింది. హవాలా లావాదేవీలకు పాల్పడిన శివ కుమార్పై ఐటి డిపార్ట్మెంట్ కూడా ఛార్జీ షీట్ దాఖలు చేసింది. శివ కుమార్తో పాటు ఉద్యోగి హౌమంతయ్యను అరెస్టు చేశారు. కర్నాటకలో శివ కుమార్ ఏడు సార్లు ఎంఎల్ఎగా గెలిచారు.
DK Shivakumar granted bail by Delhi High Court
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post శివకుమార్కు బెయిల్ మంజూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.