న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు రాజ్ఘాట్ చేరుకున్న మోడీ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న మోడీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
The post ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.