జిల్లా పార్టీ కార్యాలయాలపై టిఆర్ఎస్ నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ పార్టీ నేతలకు నిర్దేశించారు. తెలంగాణభవన్లో టిఆర్ఎస్ ముఖ్య నేతలతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని టిఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 29 జిల్లాల్లో శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు సిఎం చెక్కులు అందజేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60లక్షల చెక్కును, భవన నిర్మా ణ ప్రణాళికను అందించారు.
నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేతలకు సిఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తం గా జరుగుతున్న సభ్యత్వనమోదు జరిగిన చర్చ సందర్భంగా సభ్యత్వ నమో దు బాగా జరుగుతుందని చెప్పిన సిఎం పార్టీ సభ్యత్వ నమోదుపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరుకల్లా గ్రామ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ కమిటీలో సమర్థులకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయగలిగామని చెప్పినట్లు తెలిసింది.
టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో భవిష్యత్తులో పార్టీ మరింత బలపడుతుందని చెప్పినట్లు తెలిసిం ది. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు మరింత చేరువైందని, భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతమవుతుందని కెసిఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోడు భూముల వ్యవహారాన్ని కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. త్వరలో వీటన్నింటినీ పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సి.మల్లారెడ్డి, మాజీ మంత్రి టి.హరీష్రావు, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి జోగినిపల్లి సంతోష్కుమార్ తదితరులు హాజరయ్యారు.
CM KCR Meeting With TRS Leaders in Telangana Bhavan
Related Images:
[See image gallery at manatelangana.news]The post దసరాకు పూర్తి కావాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.