చిన్నశంకరంపేట (మెదక్) : తెలంగాణలో సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ కు ఓటేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రజలను కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు ఆదివారం మండల పరిధిలోని సూరారం గ్రామంలో సూరారం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి చిలక అనురాధ నాగరాజు, జడ్పీటీసీ అభ్యర్థి పట్లోరి మాధవి రాజులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోకి వెళ్లగానే సూరారం కార్యకర్తలు బొట్టుపెట్టి మంగళాహరతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు. టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాభివృద్ది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.. సిఎంగా కెసిఆర్ ఉన్నారని, మెదక్ ఎమ్మెల్యేగా తానున్నానని, చిన్నశంకరంపేట మండలంలో టిఆర్ఎస్ ఎంపీపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటారని , వేరే పార్టీల వారు వస్తే అభివృద్ధి ఉండదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మిమోసపోవద్దని ఓటర్లను కోరారు. సూరారం ఎంపీటీసీ అభ్యర్థిగా చిలక అనురాధ నాగరాజు, జడ్పీటీసీ అభ్యర్థి పట్లోరి మాధవి రాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు,మాజీ సర్పంచ్ అయ్యవారి లక్ష్మణ్, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, నీరజ పవన్గౌడ్, ఎంపీటీసీ కవితప్రతాప్రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
MLA Padma Devender Reddy Election Campaign
Related Images:
[
See image gallery at manatelangana.news]
The post అభివృద్ధిని చూసి ఓటేయండి : పద్మాదేవేందర్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.