న్యూఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సంస్థకు చెందిన కొత్త ఎంట్రీ లెవెల్ కారు ఎస్ప్రెస్సో బెస్ట్ సెల్లింగా కారుగా నిలిచింది. ప్రారంభించిన ఒక నెలలోనే దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే 10 కార్లలో స్థానం దక్కించుకుంది. కంపెనీ 2019 అక్టోబర్లో ఎస్-ప్రెస్సో 10,634 యూనిట్లు విక్రయించింది. ఎస్ప్రెస్సో వినియోగదారులకు ఉత్తమ డిజైన్, సాంకేతికత, భద్రత అందిస్తుంది. ఇది బిఎస్6ను కల్గి 1.0 ఎల్కె10 ఇంజిన్తో వస్తోంది. ఎస్ ప్రెస్సోకు లభించిన ఆధరణకు మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కారు ధర రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల మధ్య ఉంటుంది.
Maruti Suzuki S Presso enters top 10
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post టాప్ 10లో చేరిన మారుతీ ఎస్ప్రెస్సో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.