పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
హైదరాబాద్ : ముగ్గురు అక్కాచెల్లెళ్లు అ దృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్ర కారం…రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన రహాణా బేగం ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు హుడా ఫాతిమా (20), తస్లీం పాతిమా(18), తైసర్ ఫాతిమా(16) ఉ న్నారు. రహాణా బేగం ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం చాంద్రాయణగుట్టలోని ఫాతిమా డయాగ్నస్టిక్స్లో ఉద్యోగానికి వెళ్లింది.
సాయంత్రం ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. కుమార్తెలు పక్కింటి వెళ్లారని భావించి, తన వద్ద ఉన్న తాళం చెవితో తాళం తీసి లోపలికి వెళ్లింది. ఇంట్లో చూడగా బాగు, అందులోని రూ.4,500 కన్పించలేదు. చుట్టుపక్కల ఉన్న వారికి కూడా చెప్పకుండా వెళ్లడంతో ఇంటి పరిసరాల్లో వెతికింది. బంధువుల ఇంటికి వెళ్లారేమోనని వారికి ఫోన్ చేసి వాకాబు చేయగా రాలేదని చెప్పారు. దీంతో వెం టనే రహాణా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బాలాపూర్ పోలీసులు తెలిపారు.
Disappearance of the Three Siblings
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.