హైదరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండకు సిఎం కెసిఆర్ బృందం బయల్దేరింది. ఈ బృందంలో మంత్రులు, కలెక్టర్లు ఉన్నారు. హరితహారం, మిషన్భగీరథపై కలెక్టర్లకు, మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భగీరథ కేంద్రాన్ని మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి సిఎం స్వయంగా పరిశీలిస్తారు. పథకం తీరుతెన్నులను సిఎం స్వయంగా వారికి వివరిస్తారు. సిఎం రాక నేపథ్యంలో కోమటిబండ ప్రాంతంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
CM KCR Visits Gajwel Zone Of Komatibanda Today
Related Images:
[
See image gallery at www.manatelangana.news]
The post కోమటిబండకు బయల్దేరిన కెసిఆర్ బృందం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.