తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 77, 739 మంది దర్శించుకున్నారు. 32,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.3.42 కోట్ల ఆదాయం సమకూరింది.