న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాలను తయారు చేసే ఎస్కార్ట్స్ లిమిటెడ్ డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ను ఆవిష్కరించింది. వ్యవసాయంలో రైతులు పడుతున్న కష్టాలను తగ్గించే ఉద్దేశ్యంతో ఈ ట్రాక్టర్ ను అభివృద్ధి చేసింది. వచ్చే రెండేళ్లలో దీనిని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎస్కార్ట్ గ్రూప్ ఎండి నిఖిల్ నందా తెలిపారు. ట్రాక్టర్ ను ఆపరేట్ చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ కోసం రిలయన్స్ జియో, మైక్రోసాప్ట్, సంవర్థన మదర్సన్ గ్రూప్,వంటి ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ డ్రైవర్ లెస్ స్మార్ట్ ట్రాక్టర్ దుక్కి దున్నడమే కాకుండా విత్తనాలు కూడా చల్లుతుందని నిఖిల్ నందా పేర్కొన్నారు.
Comments
comments