ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్9 ను తాజాగా న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో విడుదల చేసింది. భారీ డిస్ప్లే తో పాటు హెచ్డి ప్లస్ రిజల్యూషన్, బ్యాటరీ బ్యాకప్ లాంటి అద్భుత ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. దీంట్లో ‘ఎస్ పెన్’ ని బ్లూటూత్ కి అనుసంధానం చేయడం ద్వారా సెల్ఫీ సులభంగా తీసుకోవచ్చు. టాప్ఎండ్ మోడల్ లో 512జిబి ఇంటర్నల్ మెమొరీతో పాటు మెమొరీ కార్డు ద్వారా దీనిని 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఇందులో ఉన్న డెక్స్ సాఫ్ట్వేర్ సహాయంతో కంప్యూటర్ తరహాలో కూడా ఈ ఫోన్ ను వినియోగించుకోవచ్చు. 6జిబి/128జిబి ధర సుమారు రూ.68700 కాగా… 8జిబి/512జిబి ధర సుమారుగా రూ.85900గా ఉండే చాన్స్ ఉంది. యుఎస్ లో ఆగస్ట్ 24నుండి కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. అతితోందరలోనే ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
గెలాక్సీ నోట్9 అద్భుత ఫీచర్లు…
ఎస్ పెన్, డాల్బీ అట్మోస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
వెనక భాగంలో 12/12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2960 x 1440 పిక్సల్స్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్, 6.4″ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఐపి 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్.