ఖమ్మం: గోపాలపురంలో ఆదివారం క్రేన్ బీభత్సం సృష్టించింది. అనాథశరణాలయంలోకి క్రేన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిలో అనాథ విద్యార్థి ఉన్నట్టు సమాచారం. క్రేన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
One Member Died in Crane Accident in Khammam
Comments
comments