ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల, పొచ్చర జలపాతాల్లోకి భారీగా వరద ఉద్ధృతి పెరిగింది. పెన్గంగ నదికి భారీగా వరద ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొండపొర్లడంతో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీమిని మండలంలో ఎర్రవాగు, వేమనపల్లి మండలంలో గొర్లపల్లి వాగు ఉప్పొంగింది. బాబాపూర్, తంగళ్లపల్లి, చిన్నగుడిపేట, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆసిఫాబాద్లోని పైకాజీనగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.